రియా బెయిల్ పిటిషన్.. రెండోసారి తిరస్కరణ

బాలీవుడ్  హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య‌ కేసు దర్యాప్తులో డ్రగ్స్‌ కోణం బయటపడిన సంగతి తెలిసిందె. దీంతో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌బీసీ) రంగంలోకి దిగి.. దర్యాప్తు చేస్తున్నారు. విచారణ క్రమంలో రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితోపాటు అబ్దుల్‌ బాసిత్‌, జైద్‌ విలాత్రా, దీపేష్‌ శావంత్‌, శామ్యూల్ మిరాండాలను అరెస్టు చేశారు.

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం బెయిలు కోరుతూ ఆమె వేసిన పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి అనుమతించింది. దీంతో ఆమెను బైకుల్లా మహిళా జైలుకు అధికారులు తరలించారు. శుక్రవారం రెండోసారి కూడా బెయిల్‌ తిరస్కరణకు గురైంది. ‘నేను అమాయకురాల్ని, ఎటువంటి నేరం చేయలేదు. తప్పుడు ఆరోపణలతో ఈ కేసులో నన్ను ఇరికించారు’ అని రియా పిటిషన్‌ ద్వారా కోర్టుకు విన్నవించుకున్నారు. అంతేకాదు.. తనతో బలవంతంగా నేరం అంగీకరింపజేశారని పిటిషన్ పత్రాల్లో పేర్కొంది.