కేసీఆర్ మరోసారి సూపర్ హిట్

ప్రజానాడి బాగా తెలిసిన నాయుడు సీఎం కేసీఆర్. ప్రజలు ఏం చేస్తే హర్షిస్తారు ? ఏం చేస్తే శిక్షిస్తారు ?? అన్నది ఆయనకి బాగా తెలుసు. రైతుబంధు, రైతు భీమా తెచ్చి రైతుల కళ్లలో ఆనందం నింపారు. వారి చేత అభినందనలు పాలాభిషేకాలు చేయించుకున్నారు.
 
ఇక దుమ్మెత్తిపోసిన ఆర్టీసీ కార్మికులే.. వారి కోసం ఆలోచించి సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. పాలాభిషేకాలు చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీఆర్ వోల పీడ విరగడైందని సంతోష పెడుతున్నారు. ఈ సంతోషంలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకాలు చేస్తున్నారు.