ప్రభాస్ సినిమా షూటింగ్ మొదలు

కరోనా లాక్‌డౌన్ తో సినిమా షూటింగ్ లకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడో షూటింగ్ లకు అనుమతులు ఇచ్చినా.. పెద్ద సంఖ్యలో సినిమా షూటింగ్ లు మొదలు కాలేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు మొదలు కాలేదు. ఇప్పుడిప్పుడే వారు కూడా రంగంలోకి దిగిపోతున్నారు.

ఇటీవలే సీనియర్ స్టార్ హీరో నాగార్జున్ షూటింగ్ మొదలెట్టారు. ‘వైల్డ్ డాగ్’ సినిమాతో పాటుగా బిగ్ బాస్ 4 లోనూ పాల్గొంటున్నారు. తాజాగా స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ సైతం పనిలోకి దిగినట్టు తెలుస్తోంది. ఆయన చిత్రం కోసం మహారాష్ట్ర వెళ్లినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు హీరోయిన్ పూజా హెగ్డే బయలు దేరింది. దానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత ఆదిపురుష్ సినిమాలో నటించనున్నారు. ‘రాధేశ్యామ్’ షూటింగ్ మొదలు