సుశాంత్ కేసు.. ఇప్పటి వరకు అరెస్టన వారి లిస్టు ఇదే !

తీగ లాగితే డొంక కదిలినట్టు.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు ఎన్సీబీ అధికారులు 11 మందిని అరెస్ట్ చేశారు. లెటెస్ట్ గా కరన్‌జీత్‌ అలియాస్‌ కేజే అనే ఈ వ్యక్తిని ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో అరెస్టు చేసినట్టు సంస్థ తెలిపింది.

రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, సుశాంత్‌ మేనేజర్‌ సామ్యూల్‌ మిరాండా, సహాయకుడు దీపేష్‌ సావంత్‌తో పాటు, డ్రగ్స్‌ విక్రయంతో సంబంధమున్న జాయేద్‌ విలాట్రా, అబ్దెల్‌ బాసిత్‌ పరిహార్‌, కైజన్‌ ఎబ్రహీం, కర్ణా అరోరా, అబ్బాస్‌ లఖానీ, అనుజ్‌ కేశ్వీనీ డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారిలో ఉన్నారు.

ఇక ఈ కేసు విచారణలో రియా చక్రవర్తి పలువురు ప్రముఖుల పేర్లు బయటపెట్టిన సమాచారమ్. ఈ లిస్టులో సారా అలీఖాన్ తో పాటు బాలీవుడ్ లో రాణిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు  రకుల్ స్పందించలేదు.