పరారీలో ఆర్ఎక్స్100 నిర్మాత


టీవీ నటి శ్రావణి కొండపల్లి ఆత్మహత్య కేసులో ఆర్ఎక్స్100 నిర్మాత అశోక్ రెడ్డి పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. విచారణకి ఆయనకి నోటీసులు కూడా పంపించారు. అయితే ప్రస్తుతం అశోక్ రెడ్డి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన తమ్ముడికి పోలీసులు నోటీసులు అందించారు.

ఇక కొద్దిసేపటి క్రితమే జాయింట్ సీపీ శ్రీనివాస్ కేసు వివరాలని మీడియాకు వివరించారు. శ్రావణికి సాయి, అశోక్ రెడ్ది, దేవరాజ్ తో సంబధాలున్నాయి. మొదట సాయి, ఆ తర్వాత అశోక్ రెడ్దితో శ్రావణికి పరిచయం ఏర్పడింది. 2019 ఆగస్టులో దేవరాజ్ తో శ్రావణికి ఏర్పడింది. ఈ ముగ్గురు ఏదో సమయంలో శ్రావణిని పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అయితే దేవరాజ్ తో స్నేహాన్ని చూసిన సాయికి నచ్చలేదు. సాయి, శ్రావణి కుటుంబ సభ్యులు.. దేవరాజ్ తో దూరంగా ఉండాలని సూచించారు. ఒత్తిడి తెచ్చారు. అయితే దేవరాజ్ కూడా శ్రావణిని పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఆ తర్వాత ఆమెకి ఇతర సంబంధాలున్నాయని దూరం పెట్టడం జరిగింది. దాన్ని తట్టుకోలేక శ్రావణి సూసైడ్ చేసుకొని ఉంటుందని పోలీసులు మీడియాకు తెలిపారు.

ఈ కేసులో ఏ1గా సాయి, ఏ2గా అశోక్ రెడ్ది, ఏ3గా దేవరాజ్ ని చేర్చాం. అశోక్ రెడ్డి కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని తెలిపారు.  అతడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం జరుగుతుందని చెప్పారు.