ఆళ్లగడ్డలో విషాదం.. Rose బిస్కెట్స్ తిని ఇద్దరు చిన్నారులు మృతి !

కర్నూలు జిల్లా ఆళగడ్ద మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో విషాదం చోటు చేసుకొంది. Rose బిస్కెట్స్ తిని ముగ్గురు పిల్లలు అస్వస్థతకి గురయ్యారు. బిస్కెట్స్ తిన్న వెంటనే కళ్లు తిరిగి పడిపోయారు. వీరిలో ఇద్దరు పిల్లలు హుస్సేన్ బీ, హుస్సేన్ షా మృతి చెందారు. ఆదివారం రాత్రి ఒకరు, ఈ ఉదయం మరొకరు కన్నుమూశారు. మరో పాప పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారమ్.

ప్రస్తుతం ఆమెకి ఆళ్లగడ్డలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. Rose కంపెనీ బిస్కెట్ ప్యాకెట్ పై ఎక్సైపరీ డేటు కూడా ఇంకా ఉందని చెబుతున్నారు. మరీ.. పిల్లల మృతి కారణమేంటీ ? అన్నది తెలియాల్సి ఉంది. బహుశా.. నకిలీ కంపెనీ బిస్కెట్ ప్యాకెట్ అని అనుమానిస్తున్నారు. దర్యాప్తులో నిజనిజాలు తేలనున్నాయి.