మెగాస్టార్’కు గుండు కొట్టించింది.. ఆ ప్లాప్ దర్శకుడే!

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్ లోకి మారిపోయిన సంగతి తెలిసిందే. గుండులుక్ లో ఉన్న మెగాస్టార్ ఫోటో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ మెగాస్టార్ కు గుండు కొట్టించింది ఎవరు ? అన్నదానిపై ఇప్పుడు క్లారిటీ వచ్చిందని చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత చిరు కోసం ముగ్గురు దర్శకులు రెడీగా ఉన్నారు.

సుజీత్/వినాయక్, బాబీ, మెహర్ రమేష్ మెగాస్టార్ కోసం స్క్రిప్టులతో రెడీగా ఉన్నారు. అయితే ప్లాప్ దర్శకుడు మెహర్ రమేష్ సినిమా కోసమే చిరు గుండు గీయించుకున్నట్టు సమాచారమ్. తమిళ్ హిట్ ‘వేదాళం’ రిమేక్ బాధ్యతలని చిరు మెహర్ రమేష్ కి అప్పగించినట్టు తెలుస్తోంది. ఆచార్య తర్వాత ఈ సినిమానే ఉండనుందట. చక చకా ఈ రిమేక్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. లుక్ టెస్టులో భాగంగా మెగాస్టార్ కి గుండ్ కొట్టించాడట మెహర్ రమేష్.

ఇక మెహర్ రమేష్ తో సినిమా అంటే అభిమానులు జక్కుతున్నారు. ఎందుకంటే ? ఆయన చరిత్ర అలాంటిది. స్టార్స్ కెరీర్ లో మరచిపోలేని అట్టర్ ప్లాపులు ఇచ్చిన ఘటన ఆయనది. వెంకీకి షాడో, ఎన్ టీఆర్ కు శక్తి.. ఇలా చాలానే ఉన్నాయి. మెహర్ రమేష్ అద్భుతంగా కథ చెబుతారు. కానీ దాన్ని తెరపై అంత ఎఫెక్ట్ గా చూపించలేకపోతారనే ముద్రపడిపోయింది. అయినా.. ఆయన్ని మెగాస్టార్ నమ్మారు. అవకాశం ఇచ్చారు. మరీ.. మెగాస్టార్ నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటారు అన్నది చూడాలి.