రికార్డ్ : ఒక్కరోజే 87వేల మంది డిశ్చార్జ్‌

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ దాదాపు లక్షకు చేరువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 87వేల మంది కరోనా నుంచి పూర్తి గా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజు రికవరీల్లో ఇదో రికార్డ్. ఇక ఇప్పటి వరకు 41లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.

గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 96,424 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 52,14,677కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో మరో 10లక్షల క్రియాశీల కేసులున్నాయి. నిన్న మరో 1174 మంది రోగులు చనిపోయారు. దీంతో కరోనా సోకి మృతిచెందిన వారిసంఖ్య 84,372కి చేరింది.

ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78.86శాతానికి చేరగా.. మరణాల రేటు మాత్రం 1.62శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.