ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ దాదాపు 10వేల కొత్త కేసులు నమోదయ్యేవి. ఒకట్రెండు రోజులుగా ఆ సంఖ్య 8వేలకి చేరింది. అయితే గడిచిన 24 గంటల్లో ఏపీలో 7,738 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో కరోనాబారిన వారి సంఖ్య 6,25,514కి చేరింది. నిన్న ఒక్కరోజే 57 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 5,349కి చేరింది.

నిన్న ఒక్కరోజులో 10,608 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 78,836 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.ఇక నిన్న కరోనాతో మృతి చెందిన వారిలో కృష్ణా జిల్లాలో 8 మంది, అనంతపురం 7, చిత్తూరు 7, ప్రకాశం 6, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 4, కర్నూలు 4, కడప 3, శ్రీకాకుళం 3, పశ్చిమగోదావరి 3, గుంటూరు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు.