వైరల్ : ధోని న్యూ లుక్

ఎట్టకేలకు మహేంద్ర సింగ్ ధోని అభిమానుల కోరిక తీర్చాడు. 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో ఓటమి తర్వాత ధోని మళ్లీ మైదానంలోకి దిగలేదు. దాదాపు 438 రోజుల తర్వాత ఐపీఎల్ 2020లో భాగంగా ముంబై-చెన్నైల మధ్య జరిగిన తొలి మ్యాచ్ కోసం ధోని మైదానంలోకి దిగారు. టాస్ గెలిచి చెన్నైఫీల్డింగ్ ఎంచుకుంది. ధోని మైదానంలోకి దిగగానే ఆయన అభిమానుల కడుపు నిండిపోయింది. అంతేకాదు.. ధోని కొత్త లుక్ లోకి మారిపోయారు.

దాదాపుగా సింగం టైపు లుక్ లో కనిపించారు. ధోని కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నిన్నటి మ్యాచ్ లో ధోని తొలి బంతికే అవుటయ్యాడు. అయితే డీఆర్ ఎస్ కి వెళ్లిన ధోనిని థార్డ్ అంపైర్ అవుట్ కాలేదని తెల్చాడు. అయితే ధోని 2బంతులు ఆడి.. ఖాతా తెరవకున్నా.. అవతలి ఎడ్జ్ లో ఉన్న డుప్లెసిస్ పని పూర్తి చేశాడు. తొలి మ్యాచ్ లో చెన్నై.. ముంబైపై 5వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి.. మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.