గుడ్ న్యూస్ చెప్పిన రేణు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గుడ్ న్యూస్ చెప్పారు. రీ-ఎంట్రీ ఇచ్చేందుకు ఆమె చాన్నాళ్ల నుంచి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై రేణు అధికారిక ప్రకటన చేసింది. ఓ వెబ్ సిరీస్ కు సంతకం చేశా. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుందని తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టింది రేణు.

‘మళ్లీ కెమెరా ముందుకొస్తున్నాను. నేను ఓ అందమైన వెబ్ సిరీస్ కు సంతకం చేశానని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా, ఎక్జయిటింగ్ గా ఉంది. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తా.సత్యాన్వేషణలో ఉన్న ఓ మహిళాప్రయాణానికి మీ దీవెనలు, ప్రేమను అందించాలని కోరుతున్నా’నని రేణు పోస్ట్ లో పేర్కొంది.

అక్క, వదిన, అమ్మ పాత్రల్లో నటించేందుకు సిద్ధమని గతంలోనే రేణు ప్రకటించింది. మహేష్ బాబుకు తల్లిగా నటించేందుకు రెడీ అని తెలిపింది. అయితే ఎందుకో గానీ స్టార్ హీరోల సినిమాల కోసం రేణుని ఎవరు సంప్రదించడం లేదు. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ తో రేణు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే ప్లాన్ లో రేణు  ఉన్నట్టు తెలుస్తోంది.