ఆరెంజ్‌ ఆర్మీ’కి ఆల్ ది బెస్ట్ 

విక్టరీ వెంకటేష్ క్రికెట్ ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. విదేశాలకి వెళ్లి మరీ టీమిండియా ఆడే మ్యాచ్ లని చూస్తారాయన. ఇక ఐపీఎల్ ని అస్సలు మిస్ కారు. హైదరాబాద్ సన్ రైజర్స్ ఆడే ప్రతిమ్యాచ్ ని గ్యాలరీ నుంచి వీక్షిస్తారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఈ సారి ఐపీఎల్ ని వెంకీతో పాటు అందరు మిస్ అవుతున్నారు. అయితే  ఐపీఎల్13 సీజన్ లో ఆరెంజ్ ఆర్మీ దుబాయ్‌ వేదికగా తన తొలి మ్యాచ్‌ ఆడబోతోంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడుతోంది.

ఈ సందర్భంగా వార్నర్‌ సేనకు ‘వెంకీ మామ’ శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుతంగా ఆడాలని ట్వీట్‌ చేశారు. ‘కుర్రాళ్లూ.. మిమ్మల్నెప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటాను’ అని పేర్కొన్నారు. వెంకటేశ్‌ ట్వీట్‌కు ఆరెంజ్‌ ఆర్మీ బదులిచ్చింది. ‘స్టాండ్స్‌లో ఉండి ప్రోత్సహించే మిమ్మల్ని మేం మిస్సవుతాం వెంకీమామా’ అని రీట్వీట్‌ చేసింది