దేశంలో.. 86,961 కేసులు, 1,130 మరణాలు !

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ 80వేలకు పైగా కొత్త కేసులు, వెయ్యికి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 86,961 కేసులు నమోదయ్యాయ్. మరో 1130 మంది కరోనాతో మృతి చెందారు.

దేశ‌వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54.87 ల‌క్ష‌ల‌కు చేరింది. మృతుల సంఖ్య 87, 882కు చేరింది. ప్రస్తుతం దేశంలో 10,03,299 యాక్టివ్ కేసులున్నాయి.  ఉన్నాయి. ఇప్పటి వరకు 43,96,399 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజూకి పెరుగుతున్న.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఊరటనిస్తోంది.