డ్రగ్స్ కేసులో దీపికా పదుకొనె’కు సమన్లు

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె పేరు తెరపైకి వచ్చింది. ఆమె మేనేజర్ కరిష్మాకు సమన్లు జారీ చేసేందుకు ఎన్ సీబీ అధికారులు రెడీ అవుతున్నట్టు సమాచారమ్. దీపిక మాత్రమే కాదు.. బాలీవుడ్ లోని టాప్ 5 హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. డి, ఎన్, ఎస్, జె ఇలా కోడ్ బాషలో వారి పేర్లని డ్రగ్ డీలర్ల చాట్ లో గుర్తించినట్టు తెలుస్తోంది. ఎన్ – హీరోయిన్ టాలీవుడ్ లో మాజీ స్టార్ హీరోయిన్ అని చెబుతున్నారు.

ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి తో పాటు పలువురు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఎన్ సీబీ అధికారుల విచారణలో డ్రగ్స్ డీలర్లు సంచలన విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు చెప్పినట్టు సమాచారమ్. దీపికా పదుకొనె, ఆమె మేనేజర్ పేర్లని వీరే చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ డ్రగ్స్ కేసుతో ఇంటర్ నేషనల్ లింకులు ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. అమృత్ సర్, పాకిస్థాన్ నుంచి కొకైన్ దిగుమతి చేసుకుంటున్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది.

ఇక బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ కు లింకు ఉందని చెబుతున్నారు. ఎన్ – కోడ్ తో ఉన్న హీరోయిన్ టాలీవుడ్ మాజీ హీరోయిన్ అని చెబుతున్నారు. ఆమె ఒక్కరే కాదు.. ముంబై డ్రగ్ మాఫియాతో హైదరాబాద్ కు లింకులు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే వీరికి ఎన్ సీబీ అధికారులు సమన్లు జారీ చేసి.. విచారించే అవకాశాలున్నట్టు సమాచారమ్. మొత్తంగా.. సుశాంత్ ఆత్మహత్య కేసులో కాలికి తగిలిన తీగ డ్రగ్స్ కేసు… భారతీయ సినీ పరిశ్రమని షేక్ చేయబోతుందని అర్థమవుతోంది.