బాలీవుడ్ డ్రగ్ కేసులో టాలీవుడ్ సూపర్ స్టార్ భార్య !?


బాలీవుడ్ డ్రగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఈ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె తో పాటు మరో నలుగురు ప్రవేయం ఉందని తేలినట్టు జాతీయ ఛానెల్స్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. వీరు డ్రగ్స్ డీలర్లతో వాట్సాప్ కోడ్ బాషలో చాట్ చేసినట్టు ఎన్ సీబీ అధికారులు గుర్తించినట్టు చెబుతున్నారు. డి, ఎస్, ఎన్.. ఇలా కోడ్ బాషలో ఛాట్ చేశారని తెలుస్తోంది.

ఈ జాబితాలో టాలీవుడ్ మాజీ స్టార్ హీరోయిన్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి సమ్రత శిరోద్కర్ అని తెలుస్తోంది. నమ్రత పేరుని, ఫోటోని కూడా జాతీయ ఛానెల్స్ ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో కథనాలు టాలీవుడ్ ని షాక్ కి గురి చేస్తున్నాయి. పెళ్లికి ముందు నమ్రత జీవితం ఎలా ఉండేదో తెలియదు. కానీ, మహేశ్ తో పెళ్లి తర్వాత మాత్రం నమ్రత ఏ వివాదంలో ఇరుక్కోలేదు. కంప్లీట్ ఫ్యామిలీ ఉమెన్ గా కనిపించారు. అలాంటి నమ్రత పేరు బాలీవుడ్ డ్రగ్ కేసులో వినిపించడం షాకింగ్ విషయమేనని చెప్పాలి.

ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు మరికొందరిని ఎన్ సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో వీరు సినీ, రాజకీయ ప్రముకులు పేర్లని బయటపెట్టారు. దీపిక, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, నమ్రత పేర్లని చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరికి సమన్లు జారీ చేసి.. విచారించేందుకు ఎన్ సీబీ అధికారులు రెడీ అవుతున్నట్టు సమాచారమ్.