తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గినట్టు అనిపించింది. ఇటీవల 1500లోపల కొత్త కేసులు నమోదయ్యాయ్. అయితే గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,296 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,77,070కి చేరింది.

నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,062కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,062 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,46,135 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,873 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,527 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.