డ్రగ్స్ కేసు.. దియా మీర్జా స్పందన ఇదీ !


బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎన్‌సీబీ అధికారులు ఆయన గర్ల్ ఫ్రెండ్  రియా చక్రవర్తితోపాటు 18 మందిని అరెస్టు చేశారు. వీరిని విచారిస్తున్న క్రమంలో పలువురు బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీపికా పదుకొణె పేరుతోపాటు దియా మీర్జా పేరు కూడా వినిపించింది. డ్రగ్స్‌తో ఆమెకు సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారని, విచారించబోతున్నారని రాశారు. ఈ నేపథ్యంలో దియా ట్విటర్‌ వేదికగా స్పందించారు.

“నాపై వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి పనికిమాలిన రిపోర్టింగ్‌ ప్రభావం నా పేరు ప్రఖ్యాతులపై పడుతుంది. అంతేకాదు దీని వల్ల నేను ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న నా కెరీర్‌ కూడా నాశనం అవుతుంది. నేను ఎప్పుడూ మాదక ద్రవ్యాలు, నిషిద్ధ పదార్థాల్ని నా జీవితంలో సేకరించలేదు, సేవించలేదు. నాకు మద్దతుగా నిలిచినందుకు నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు” అని దియా రాసుకొచ్చారు. ఇక ఈ కేసులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పేరు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.