బాలీవుడ్ జెర్సీ కోసం.. షాహిద్ రెమ్యూనరేషన్ రూ. 35కోట్లు ! 

తెలుగు హిట్ ‘జెర్సీ’ బాలీవుడ్ లో రిమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌లో షాహిద్‌ కపూర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. మాతృకను తీసిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. గతేడాది డిసెంబరులో షూటింగ్‌ ఆరంభమైంది. ఈ సినిమా కోసం షాహిద్ క్రికెట్ లో శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారమ్.

రూ.35 కోట్లు+పన్ను పారితోషికంగా తీసుకుంటున్నారట. అంతేకాదు సినిమాకు వచ్చే లాభంలో 20 శాతం వాటా కూడా ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. షాహిద్ గత చిత్రం కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. టాలీవుడ్ సంచలనం అర్జున్ రెడ్డికి రిమేక్ ఇది. ఇందులో షాహిద్ కపూర్-కైరా అద్వానీ జంటగా నటించారు. రూ. 60కోట్లతో తెరకెక్కిన కబీర్ సింగ్ ఏకంగా రూ. 370కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో జెర్సీ రిమేక్ కోసం భారీగా రెమ్యూనరేషన్ పెంచారని చెప్పుకొంటున్నారు.