డ్రగ్ కేసు నుంచి బయటపడిన  నమ్రత


బాలీవుడ్ డ్రగ్ కేసులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో సుశాంత్  టాలెంట్‌ మేనేజర్‌ జయా సాహాని ఎన్సీబీ అధికారులకు సంచలన విషయాలు చెప్పారు. ఆమె దీపిక పదుకొనె, శ్రద్దా దాస్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, నమ్రత పేర్లు బయటపెట్టారని జాతీయ ఛానెల్స్ కథనాలు ప్రచారం చేశాయి. త్వరలోనే వీరికి ఎన్ సీబీ అధికారులు నోటీసులు జారీ చేసి.. విచారించబోతున్నారని పేర్కొన్నాయి. ఇప్పుడది నిజమే అయింది.

తాజాగా దీపిక, శ్రద్దా, సారా, రకుల్ లకు ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారమ్. వీరిలో సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్‌ సింగ్ లని ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని‌ నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇక దీపిక పదుకొనె, ఆమె మేనేజర్ కరిష్మాను సెప్టెంబర్ 25న విచారణకు రమ్మని పిలిచినట్టు తెలుస్తుంది. కానీ నమ్రతకు ఎలాంటి నోటీసులు అందలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసు నుంచి నమ్రత బయటపడినట్టే.. డ్రగ్స్ కేసులో నమ్రత పేరు రావడం ఒట్టి గాసిప్పేనని మహేష్ అభిమానులు చెప్పుకొంటున్నారు.