సుశాంత్ తనని ఫుల్లుగా వాడుకొని.. ఇప్పుడిలా..! 

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పీకల్లోతు కష్టాల్లో పడిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతికి రియానే కారణమనే ఆరోపణలొచ్చాయ్. సుశాంత్ కి తెలియకుండానే ఆయనకి రియా డ్రగ్స్ ఇచ్చేదనే చెప్పుకొంటున్నారు. రియానే సుశాంత్ చంపేసిందని.. సామాన్యులే కాదు పలువురు ప్రముఖులు బాహాటంగానే కామెంట్ చేశారు.

మరోవైపు సుశాంత్ ఆత్మహత్య కేసులో బయటపడిన డ్రగ్స్ కోణంలో రియా , ఆమె సోదరుడు అరెస్టయ్యారు. ఈ కేసులో బెయిల్ కోసం ప్రయత్నించినా దొకడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి తన ఆవేదనని వెళ్లగక్కింది రియా. సుశాంత్ తనను ఫుల్ గా వాడుకున్నాడని, అతడి వల్ల ఇప్పుడిలా తను మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ప్రకటించింది.

మరోవైపు ఈ కేసులో పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్, దియా మీర్జా తెరపైకి వచ్చాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పేరు కూడా ఈ కేసులో వినిపిస్తోంది. బాలీవుడ్ లో రాణిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈ కేసులో సమన్లు అందినట్టు సమాచారమ్.