ఏపీలో కొత్త కేసుల కంటే రికవరీ ఎక్కువ. కానీ.. !

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. అయితే ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో  7,855 కొత్త కేసులు నమోదయ్యాయ్. అదే సమయంలో 8,807 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే కొత్త కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,54,385కి చేరింది.24 గంటల వ్యవధిలో 52 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 8 మంది, అనంతపురం 6, గుంటూరు 6, కృష్ణా 5, ప్రకాశం 5, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి 4, కడప 3, కర్నూలు 3, పశ్చిమగోదావరి 3, విజయనగరం 2, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,558కి చేరింది.