డ్రగ్స్ కేసు : రకుల్ సమన్లు వచ్చాయా ? రాలేదా ??


బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. రకుల్ తో పాటుగా దీపికా పదుకొనె, ఆమె మేనేజర్ కరిష్మా, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ పేర్లు బయటికొచ్చాయి. ఎన్సీబీ అధికారుల విచారణలో రియా చక్రవర్తి వీరి పేర్లని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి ఎన్ సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 24, 26 తేదీల్లో విచారణకి రావాలని ఆదేశించారు.

అయితే వీరిలో రకుల్ ప్రీత్ సింగ్ కి ఇంకా సమన్లు అందలేదట. ఎన్ సీబీ అధికారులు మాత్రం రకుల్ కూడా సమన్లు జారీ చేశామని చెబుతున్నారు. రకుల్ మాత్రం తనకు ఇంకా సమన్లు అందలేదని చెబుతుందని తెలిసింది. ప్రస్తుతం రకుల్ క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. అయితే ఇప్పటికే రకుల్ ముంబై బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తోంది.

మరోవైపు గోవాలో ఉన్న దీపికా పదుకొనె కూడా ముంబై బయలుదేరి వెళ్లినట్టు తెలిసింది. ఆమె తరుపున వాదించేందుకు 12 మంది న్యాయవాదుల బృందం కూడా ఏర్పాటైనట్టు తెలుస్తోంది. ఎన్ సీబీ అధికారులు విచారణలో దీపికా పదుకొనె ను ఏయే ప్రశ్నలు వేస్తారు. వాటిని ఆధారంగా కేసుని వాదించేందుకు దీపిక న్యాయవాదుల బృందం ప్లాన్ చేసుకుంటోంది. ఇక ఈ కేసులు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పేరు కూడా తెరపైకి వస్తుంది.