బాలు కోసం.. ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లిన కమల్‌ !

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో చెనై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెసిందే. కోలుకున్నట్టే కనిపించిన బాలు ఆరోగ్యం విషమించింది. ఈ విషయం తెలియగానే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు. బాలు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇక కొద్దిసేపటి క్రితమే ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ ని విడుదల చేశాయి. ‘కరోనాతో బాధపడుతూ ఆగస్టు 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంజీఎం కేర్ లో చేరారు. అప్పటి నుంచి ఆయనకి ఎక్మో, వెంటిలేటర్ సహ ఐతర మార్గాల ద్వారా చికిత్స అందిస్తునాం. గత 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. బాలు ఆరోగ్యాన్ని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి’ అని బులిటెన్ లో పేర్కొన్నారు.