బాలు ఆరోగ్యం అత్యంత విషమం.. మరికాసేట్లో మరో హెల్త్ బులిటెన్ !

లెజెండ్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుతోంది. ఈ సాయంత్రమే బాలు ఆరోగ్యంపై చెన్నై ఎంజీఎం ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో బాలు ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం బాలు ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలిసిందే. ఈ నేపథ్యంలో అర్థరాత్రి దాటక మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని చెబుతున్నారు.

మరోవైపు బాలుని చూడానికి ఆసుపత్రికి ప్రముఖులు వస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ వచ్చి వెళ్లారు. మీడియాతో మాట్లాడిన కమల్ బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాలుకు అత్యంత సన్నిహితుడు దర్శకుడు భారతీరాజా కూడా వస్తారని తెలుస్తోంది. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బాలు ఆరోగ్యంపై ఆరా తీశారు. ఎంజీఎం ఆసుపత్రికి ఫోన్ చేసి బాలు ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని తెలిసింది. అయితే అవసరమైతే ఇతరులు వైద్య నిపుణుల సాయం తీసుకోవాలని వెంకయ్య సూచించినట్టు సమాచారమ్.