బ్రేకింగ్ : బాలు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్

గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత విషమించింది. తాజాగా బాలు ఆరోగ్య పరిస్థితిపై చెన్నైం ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేసాయి. బాలు ఆరోగ్యం విషమంగా ఉందని పేర్కొన్నాయి.
 
కరోనాతో బాధపడుతూ ఆగస్టు 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంజీఎం కేర్ లో చేరారు. అప్పటి నుంచి ఆయనకి ఎక్మో, వెంటిలేటర్ సహ ఐతర మార్గాల ద్వారా చికిత్స అందిస్తునాం. గత 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. బాలు ఆరోగ్యాన్ని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి’ అని బులిటెన్ లో పేర్కొన్నారు.

ఆగస్టు 5న బాలు కరోణాతో ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల బాలు కరోనా నుంచి కోలుకున్నారు. వ్యామాయం చేయడం, ఆహారం తీసుకోవడం కూడా మొదలుపెట్టారు. దీంతో త్వరలోనే బాలు కోలుకుంటారని అందరు భావించారు. ఇంతలో బాలు ఆరోగ్యం విషమించడంతో అందరిలో మళ్లీ ఆందోళన మొదలైంది.