గుడ్ న్యూస్ : కరోనా నుంచి తెలంగాణ కోలుకుంటోంది

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ 2వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 10లోపు మరణాలు సంభవిస్తున్నాయి. అయినా కరోనా నుంచి తెలంగాణ కోలుకుంటుదని ఆనంద పడుతున్నారు జనాలు. ఎందుకంటే ? కొత్త కేసుల సంఖ్య తగ్గకపోయినా.. కోలుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతిరోజు నమోదవుతున్న కొత్త కేసులకి సమానంగా లేదా ఎక్కువగానే రికవరీ అవుతున్నారు.

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2,176 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,79,246కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,004 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,48,139కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,070కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,037 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 23,929 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.