NCB విచారణకు హాజరైన దీపికా పదుకొనె మేనేజర్ కరిష్మా 

బాలీవుడ్ డ్రగ్ కేసులో టాలీవుడ్ స్టార్  హీరోయిన్ ఎన్సీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఉదయమే రకుల్ ఎన్ సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమెని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దీపికా పదుకొనె మేనేజర్ కరిష్మా కపూర్ ఎన్ సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెని అధికారులు విచారించబోతున్నారు. రకుల్, కరిష్మాని ఒకే దగ్గర ఉంచి విచారిస్తున్నారా ? లేక విడివిడిగా అన్నది తెలియాల్సి ఉంది.

షెడ్యూల్ ప్రకారం రేపు దీపిక పదుకొనె, ఆమె మేనేజర్ కరిష్మా కూడా ఎన్ సీబీ ముందుకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఒకరోజు ముందే కరిష్మా విచారణకు రావడం ప్రాధాన్యతని సంతరించుకుంది. మేనేజర్ కరిష్మాని విచారించిన తర్వాత దీపికాని విచారిస్తే బాగుంటుందని అధికారులు భావించినట్టు తెలుస్తోంది.