బ్రేకింగ్ : హైదరాబాద్ చందానగర్’లో పరువు హత్య

హైదరాబాద్ చందానగర్ లో పరువు హత్యా కలకలం రేపుతోంది. చందానగర్ కు చెందిన  హేమంత్.. అదే ప్రాంతానికి చెందిన అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఈ జంట గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే కూతురు ప్రేమపెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అమ్మాయి తల్లి వీరిని కిడ్నాప్ చేసి.. సంగారెడ్డి ప్రాంతంలో హేమంత్ ని అత్యంత దారుణంగా హత్య చేశాడు. నిన్న మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

కిడ్నాప్ చేసిన సమయంలో అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ సమయంలో డయల్ 100కి ఫోన్ చేసిన పట్టించుకోలేదని చెబుతున్నారు. పోలీసులకి ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతోనే హేమంత్ హత్యకు గురయ్యాడని ఆరోపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ప్రణయ్ హత్య కేసు ఘటన తెలుగు ప్రజలు ఇంకా మరవనే లేదు. ఇంతలో హేమంత్ పరువు హత్యకు బలయ్యాడు.