ఎన్సీబీ ఆఫీసుకు చేరుకున్న రకుల్


బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు అందిన సంగతి తెలిసిందే. ఈరోజు విచారణ కోసం రకుల్ ఎన్ సీబీ ముందుకు వెళ్లింది. కొద్దిసేపటి క్రితమే రకుల్ ఎన్ సీబీ కార్యాలయానికి చేరుకుంది. రియాతో డ్ర‌గ్స్ చాటింగ్ గురించి అధికారులు ర‌కుల్‌ను ప‌లు కోణాల‌లో  ప్ర‌శ్నించ‌నున్న‌ట్టు స‌మాచారమ్.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రకుల్ తో పాటు దీపికా పదుకొనె, ఆమె మేనేజర్ కరిష్మా, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ కు నోటీసులు అందాయి. ఇవాళ రకుల్ ని ఎన్ సీబీ అధికారులు విచారిస్తున్నారు రేపు దీపికా పదు‌కొనె శనివారం ఎన్సీబీ ఎదుట హాజ‌రు కానుంది. వీరు మాత్రమే కాదు.. ఈ కేసులో బాలీవుడ్ కి చెందిన దాదాపు 150 మంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పుకొంటున్నారు.