ముంబైకి చేరుకున్న రకుల్


బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ సీబీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రేపు ఆమె ఎన్ సీబీ అధికారుల ముందు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కొద్దిసేపటి క్రితమే ముంబై చేరుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాస్తవానికి గురువారమే రకుల్ ఎన్ సీబీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తనకి ఇంకా నోటీసులు అందలేదని రకుల్ తెలిపింది. ఆ తర్వాత కొద్ది గంటలకు తనకి ఇప్పుడే నోటీసులు అందాయ్. రేపు విచారణకు హాజరవుతానని రకుల్ తెలిపింది. దీంతో హైదరాబాద్ నుంచి హుఠాహుఠిన రకుల్ ముంబైకి బయలుదేరి వెళ్లింది. ప్రస్తుతం రకుల్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. ఆ షూటింగ్ ని రద్దు చేసుకొని రకుల్ ముంబై చేరుకుంది.