షాకింగ్.. డ్రగ్స్ గ్రూపుకు దీపికనే అడ్మిన్ !

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఈ కేసులో నోటీసులు అందుకున్న బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ ఈరోజు ఎన్సీబీ అధికారుల ముందు హాజరయ్యారు. అయితే విచారణలో దీపిక చెప్పిన సమాధానాలతో ఎన్సీబీ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారమ్. తన మేనేజర్ కరిష్మా ప్రకాష్ తో తనకి సాధారణ సంబంధాలే ఉన్నాయి. ఆమె డ్రగ్స్ సంబంధాలేవీ లేమని దీపిక చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే నిన్న ఎన్ సీబీ అధికారుల ముందు విచారణకు హాజరైన కరిష్మా మాత్రం. దీపిక తనకి చాలా క్లోజ్. డ్రగ్స్ గ్రూపులో దీపికనే యాక్టివ్. ఆమెని గ్రూపు అడ్మిన్ అని చెప్పినట్టు తెలుస్తోంది. దీపిక, ఆమె మేనేజర్ కరిష్మా చెప్పిన సమాధానాలు పూర్తిగా విభిన్నంగా ఉండతంతో.. ఎన్సీబీ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక దీపికతో పాటుగా ఆమె భర్త రణ్ బీర్ కపూర్ కూడా విచారణకు హాజరవుతానని కోరారన్న వార్తని ఎన్ సీబీ అధికారులు ఖండించారు. రణ్ వీర్ అలాంటి విజ్ఝప్తి ఏమీ చేయలేదని తెలిపారు.