రాజుపై కరోనా కుట్ర చేస్తున్నారట

వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు ఆ పార్టీకి కొరకాని కొయ్యలా మారాడు. ప్రతి విషయంలోనూ తలదూరుస్తూ.. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా రాజు ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం తనపై కరోనా కేసు పెట్టి.. కరోనా అంటించేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.

అంతేకాదు.. ఏపీలో మతమార్పిడిలపై సంచలన ఆరోపణలు చేశారు రెబల్ ఎంపీ. మత మార్పిడిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, అందుకోసం విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నాయని రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. సాక్షాత్తు చర్చి పాస్టర్లు కూడా హిందూ ధ్రువపత్రంతో ఉన్నారన్నారని ఆరోపించారు.