డ్రగ్స్ కేసు : నలుగురు పేర్లు బయటపెట్టిన రకుల్ 

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నిన్న ఎన్ సీబీ ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రకుల్ నలుగురు పేర్లని బయటపెట్టిన సమాచారమ్. ముఖ్యంగా బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ కు ఈ కేసుతో లింకు ఉన్నట్టు హింట్ ఇచ్చినట్టు అర్థమవుతోంది.

రకుల్ బయటపెట్టిన నలుగురు పేర్లలో కరణ్ అత్యంత సన్నిహితుడు క్షితిజ్ ప్రసాద్. అతడే తన స్నేహితులకి డ్రగ్స్ సరఫరా చేసేవాడని రకుల్ విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. రకుల్ ఇచ్చిన సమాచారమ్ తో రంగంలోకి దిగిన ఎన్ సీబీ అధికారు. కరణ్‌ జోహార్‌ సహాయకులు క్షితిజ్‌ ప్రసాద్‌, అనుభవ్‌ చోప్రాల వద్ద భారీ మొత్తంలో ఎన్‌సీబీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతో డ్రగ్స్ కేసులో కరణ్ కు కూడా సంబంధాలున్నాయనే చర్చ మొదలైంది. ఇక రకుల్ బయటపెట్టిన మరో ముగ్గురి పేర్లు ఎవరివి ? అన్నది తెలియాల్సి ఉంది. 

ఇక తనకి డ్రగ్స్ తీసుకొనే అలవాటు లేదు. కాకపోతే రియా చక్రవర్తి డ్రగ్స్ ని తీసుకొచ్చి తన ఇంట్లో దాచిపెట్టేదని రకుల్ ఎన్ సీబీ విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు రకుల్ బయటపెట్టిన పేర్లలో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఏమైనా ఉన్నాయా ? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక ఈ ఈ కేసులో దీపిక, శ్రద్దా, సారా ఈ రోజు ఎన్ సీబీ విచారణకు హాజరయ్యారు.