ఏపీ మంత్రి వెల్లంపల్లికి కరోనా

తెలుగు రాష్ట్రాల్లో కరోనా బారినపడుతున్న ప్రజాప్రతినిధుల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈనెల 25న వెల్లంపల్లి స్వల్ప అస్వస్థతకి లోనయ్యారు. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం మంత్రి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనని కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు.

ఇక ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చిన సీఎం వెన్నంటే ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అలర్ట్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయనకు కరోనా టెస్టులు చేయనున్నారని సమాచారమ్. సీఎం ఒక్కరే కాదు.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రులు, ఇతరులకి కూడా కరోనా టెస్టులు చేయనున్నారని తెలుస్తోంది.