బండ్ల పంటపడిందోచ్.. పవన్ ఓకే చెప్పేశాడు !

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పంటపడింది. ఆయనకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓకే చెప్పేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బండ్ల ట్విట్ చేశారు. ముందుగా.. ఈ ఉదయం 11:23కి నా భవిష్యత్ ని ప్రకటించబోతున్నట్టు ట్విట్ చేసిన బండ్ల.. నా దేవుడు పవన్ ఓకే చెప్పేశారని సడెన్ సప్రైజ్ ఇచ్చారు.

పవన్-హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమాని బండ్ల గణేష్ నిర్మించిన సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది. ఈ సినిమాతో బండ్ల బడా నిర్మాతగా మారారు. ఆ తర్వాత అన్నీ బడా సినిమాలే చేశారు. ఫైనల్ గా దివాలా తీసి.. టెంపర్ తర్వాత సినిమాలకి దూరమయ్యారు. ఈ యేడాది మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు.

ఇక నిర్మాతగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు చాన్నాళ్లుగా పవన్ వెంటపడుతున్నారు. కరుణించాలని వేడుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రార్థనలు ఫలించాయ్. పవన్ ఓకే చెప్పేశారు. ఈ ఆనందంతో తనకు భవిష్యత్ ఉందని ధీమాగా ప్రకటించుకున్నారు బండ్ల గణేష్. మరీ మరోసారి బండ్లకి గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ దక్కాలని ఆశిద్దాం.

ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు. క్రిష్ సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఈ రెండు సినిమాలని పూర్తి చేసిన తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ సినిమా ఉండనుంది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి లైన్ లో ఉన్నారు. మరీ.. ఇవన్నీ పూర్తయిన తర్వాతే బండ్ల సినిమా ఉండనుందా ? లేక మధ్యలోనే ఆయనకు అవకాశం ఇస్తారా ? ఈ సినిమాకు దర్సకుడు ఎవరు ?? పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.