టాలీవుడ్ ని భయపెడుతున్న రకుల్

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు ఎన్ సీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆమె విచారణకు కూడా హాజరయ్యారు. తనకి డ్రగ్స్ తీసుకొనే అలవాటు లేదు. కానీ తన ఇంట్లో రియా డ్రగ్స్ దాచిపెట్టేదని రకుల్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ కి రకుల్ భయం పట్టుకుంది.

ఈ కేసు రకుల్ టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఏమైనా బయటికి చెప్పిందా ? అనే భయం నెలకొంది. ఎందుకంటే.. ? టాలీవుడ్ లో చాన్నాళ్ల క్రితమే డ్రగ్స్ దందా బయటికొచ్చింది. ఈ కేసులో పలువురు సినీ ప్రముఖులు విచారణ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఈ కేసు స్తబ్ధతగా ఉంది. ఇప్పుడు ఎన్ సీబీ విచారణలో రకుల్ ఏమైనా నోరు తెరచి టాలీవుడ్ ప్రముఖుల పేర్లు చెబితే మరోసారి రచ్చ మొదలవుతుందని భయపెడుతున్నారు. ఎందుకంటే? రకుల్ ఇక్కడ స్నేహితులు ఎక్కువే. ఇక్క పార్టీలకు, పబ్ లకి హాజరవుతుంటుంది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ కి రకుల్ భయం పట్టుకుంది.