లాస్య-శ్రీముఖీ డిష్యూం.. డిష్యూం !

యాంకర్లు లాస్య, శ్రీముఖీ పోట్లాకి దిగారు. వార్నింగులు ఇచ్చుకున్నారు. అసలు వీరి మధ్య ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ? ఉమెనియా మూడో ఏపీసోడ్ చూడాల్సిందే. శ్రీముఖి నిర్మాత ఉమెనియా టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె మూడో గెస్ట్ గా లాస్యని ఆహ్వానించింది. వీరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ షో ద్వారా కొన్ని సీక్రెట్స్, కొన్ని గాసిప్స్ కి సమాధానాలు దొరికేలా ఉన్నాయి.

తాజాగా ఈ ఏపీసోడ్ ప్రోమోని విడుదల చేశారు. లాస్య, శ్రీముఖీ ప్రోమోలో రచ్చ చేశారు. ఫుల్లుగా నవ్వించారు. అంతేకాదు.. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకున్నరు. వార్నింగులు ఇచ్చుకున్నారు. మొత్తానికి.. మూడో ఏపీసోడ్ చూడకుండా ఉండలేం అనేలా ప్రోమోలో సందడి చేశారు. ప్రస్తుతం లాస్య బిగ్ బాస్ తెలుగు సీజన్ లో 4లో ఉంది. ఈ ఏపీసోడ్ తో ఆమెకి బిగ్ బాస్ ఇంట్లోను మైలైజ్ వచ్చేలా ఉంది.