హీరోయిన్స్’కు కేంద్ర భద్రత.. ఫ్యాషన్ అయిపోయిందా ?

సంచలన కామెంట్స్ చేయడం, ఆ తర్వాత తమకు ప్రాణహాని ఉంది.. కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరడం ఫ్యాషన్ అయిపోయింది. ఇటీవల హీరోయిన్ కంగనాకు కేంద్రం వై కేటగిరి భద్రతని కల్పించిన సంగతి తెలిసిందే. ‘కంగనా వర్సెస్ శివసేన’ ఏపీసోడ్ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఆమెకు కేంద్రం భద్రతని ఏర్పాటు చేసింది.

అంతకుముందు వైకాపా రెబల్ ఎంపీకి రఘు రామకృష్ణ రాజు కూడా కేంద్రం వై కేటగిరి భద్రతని ఏర్పాటు చేసింది. ఇప్పుడు నటి పాయల్ ఘోష్ కూడా తనకు భద్రత కావాలంటూ మధ్య ప్రదేష్ గవర్నర్ ని కలిసి వినపతి పత్రం ఇచ్చింది. ఇటీవల ఆమె బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అనురాగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పాయల్ గవర్నర్ కలిసింది. ఆమెకి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాయల్ కు కూడా కేంద్రం భద్రత కల్పించవచ్చని తెలుస్తోంది. మొత్తానికి.. సంచలన ఆరోపణలు చేసి కేంద్ర భద్రతని పొందడం ఫ్యాషన్ అయిపోయినట్టుంది.