ఏపీలో తగ్గిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 6,133 కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,93,484కి చేరింది. నిన్న ఒక్కరోజే  7,075 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య  62, 9211కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 58,445 యాక్టివ్‌ కేసులున్నాయి.

నిన్న 48 మంది కరోనాతో మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 8 మంది, ప్రకాశం 6, తూర్పుగోదావరి 5, కృష్ణా 5, విశాఖపట్నం 5, అనంతపురం 4, గుంటూరు 4, పశ్చిమగోదావరి 4, కడప 3, కర్నూలు 2, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,828కి చేరింది.