దేశంలో 80,472 కొత్త కేసులు, 86,428 రికవరీ !

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసులు తగ్గుతూ.. పెరుగుతున్నాయ్. అయితే రికవరీ అవుతున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 80,472 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 62,25,763కు చేరింది. వీరిలో ఇప్పటికే 51,87,826 మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 86,428 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

ప్రస్తుతం దేశంలో 9లక్షల 40వేల యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24గంటల వ్యవధిలో మరో 1179మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 97,497కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83.33శాతం ఉండగా, మరణాల రేటు 1.57శాతంగా ఉంది.