ఏపీ అటవీశాఖ అధికారి ఆత్మహత్య

హైదరాబాద్ లో ఏపీ అటవీశాఖ ఉన్నతాధికారి వి.బి.రమణమూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగోల్‌లోని అపార్టుమెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రమణమూర్తి ప్రస్తుతం ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటివ్‌ అధికారిగా ఉన్నారు.