ఒక్క నెలలోనే 26 లక్షల కేసులు, 33వేల మరణాలు !

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే దేశంలో 26లక్షల కరోనా కేసులు, 36వేల మరణాలు సంభవించాయి. నిత్యం దాదాపు 80వేలకుపైగా కేసులు వస్తున్నాయి. నిన్న మరో 86,821 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 63,12,584కు చేరింది.

గడిచిన 24గంటల వ్యవధిలో 1181 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 98,678కి చేరింది. గడిచిన 24గంటల్లో 85,376 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు 52,73,201 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మరో 9లక్షల 40వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం, దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83.53శాతం ఉండగా, మరణాల రేటు 1.56శాతంగా ఉంది.