మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుకు గాయాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు గాయాలయ్యాయి. గాలికి గాయాలతో పాటు శరీరంలో అక్కడక్కడ దెబ్బలు తగిలాయ్. కొడుకుని కేటీఆర్ వెంటనే ఓ కార్పోరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లతో మాట్లాడారు. ప్రస్తుతం వివిధ రకాల పరీక్షలు చేస్తున్నారు.
 
గుర్రపు స్వారీ చేస్తుండగా జారీ కిందపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. తాత, తండ్రితో హిమాన్షు చాలా సరదాగా ఉంటారు. కార్యకర్తల్లోనూ ఆయనకి ఇప్పుడిప్పుడే ఫాలోయింగ్ పెరుగుతోంది. ఇటీవల హిమాన్షు బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన పోస్టర్లు దర్శనమిచ్చాయి.