దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టే కనిపించింది. రోజూవారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 70వేలకు దిగువగా నమోదయ్యాయ్. అయితే తాజాగా కేసుల సంఖ్య మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 81,484 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,94,069కి చేరింది.

నిన్న ఒక్కరోజే 1,095 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 99,773కి పెరిగింది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 78,877 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 53,52,078గా ఉంది. ప్రస్తుతం 9,42,217 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 83.70 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.56గా ఉంది. ఇప్పటి వరకూ నిర్వహించిన టెస్టుల సంఖ్య 7,67,17,728కి చేరింది.