హైదరాబాద్’లో అడుగుపెట్టిన కంగనా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎక్కడున్నా, ఏం చేసినా వార్తే.  నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ పై కంగనా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతికి బాలీవుడ్ లో బంధుప్రీతియే కారణమని ఆరోపించింది. ఆ తర్వాత ముంబైపై సంచలన కామెంట్స్ చేసి శివసేనకు టార్గెట్ గా మారింది. ఈ క్రమంలో ఆమెకి కేంద్రం భద్రత పెంచింది. వై కేటగిరి భద్రతని ఇచ్చింది.

తాజాగా కంగనా హైదరాబాద్ కి విచ్చేసింది. ఇక్కడే 15రోజుల పాటు ఉండనుంది. ఓ సినిమా షూటింగ్ కోసమే ఆమె భాగ్యనగరానికి వచ్చినట్టు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలోనే 15రోజులు ఉందనుంది. అయితే ఈ విషయాన్ని బయటికి చెప్పడం లేదు. ఆమెకి భద్రత కల్పించేందుకు తెలంగాణ పోలీసులని పంపించినట్టు తెలుస్తోంది. ఇక తెలుగులో ఏక్  నిరంజన్ సినిమాలో నటించింది కంగనా. వాస్తవానికి ఆమె పోకిరి సినిమాలో నటించాలి. కానీ అది మిస్ అయింది. ఆ తర్వాత ఏక్ నిరంజన్ లో ప్రభాస్ తో రొమాన్స్ చేసింది.