తెలంగాణలో 2వేల కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2,009 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,95,609కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1145కి చేరింది.

కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,437 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,65,884కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 28,620 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,372 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.