TSలో 1,718 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,718 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,97,327కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1153కి చేరింది.

నిన్న ఒక్క రోజే కరోనా నుంచి 2,002 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,67,846కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 28,328 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,224 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో 285 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.