హాథ్రస్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్

హాథ్రస్‌ అత్యాచార బాధిత కుటుంబాన్ని కలిసేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు గురువారం ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈరోజు మరోసారి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు తమ పార్టీ ఎంపీలతో కలిసి రాహుల్‌, ప్రియాంక ఢిల్లీ నుంచి హాథ్రస్‌ బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో ఉత్తరప్రదేశ్ సరిహద్దుల వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు.

సరిహద్దు గేట్లను మూసివేశారు. హాథ్రస్‌లో 144 సెక్షన్‌ కొనసాగుతున్నందున అక్కడకు వెళ్లేందుకు నేతలకు అనుమతి లేదని తెలిపారు. ఆ తర్వాత ఉన్నతాధికారులతో సంప్రదింపుల చేపట్టిన పోలీసులు కాంగ్రెస్‌ నేతల పర్యటనకు అనుమతిచ్చారు. అయితే ఐదుగురు మాత్రమే వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో రాహుల్‌, ప్రియాంక మరో ముగ్గురు నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు.  వాద్రాలు బాధిత కుటుంబాన్ని కలిసి వారిని పరామర్శించారు. ఘటన గురించి బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.