రెమ్యూనరేషన్’లో 20శాతం కోత.. ఇదీ పక్కా ప్లాన్ ! 

కరోనా ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై గట్టిగా పడింది. ఈ క్రమంలో ప్రతిఒక్కరు రెమ్యూనరేషన్ లో 20 శాతం తగ్గించుకోవాలని ఇటీవల సమావేశమైన యాక్టివ్‌ తెలుగు సినీ నిర్మాత గిల్డ్ నిర్ణయించింది. కానీ ఈ తగ్గింపు స్టార్ హీరోలు ఒప్పుకోకపోవచ్చు. అందుకే పక్కా ప్లాన్ ని అమలు చేశారు. సినిమాకు 5 లక్షల కంటే ఎక్కువ తీసుకునేవారి పారితోషికంలో 20శాతం తగ్గింపు విధించాలని యాక్టివ్‌ తెలుగు సినీ నిర్మాత గిల్డ్‌, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)తో ఒప్పందం చేసుకుంది.

శనివారం ఈ విషయమై సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌ల ప్రతినిధులు సమావేశమై చర్చించారు. కరోనా ప్రభావం తగ్గే వరకూ ఖర్చులు తగ్గించుకోవాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రోజుకు రూ.20వేల కంటే తక్కువ తీసుకునేవారి పారితోషికం విషయంలో మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు స్టార్ హీరోలకు కూడా తగ్గాల్సిందే. పారితోషికం తగ్గించుకోవాల్సిందే. ఎందుకంటే .. ? మా నిర్ణయం.