సీఎం జగన్ ఇంట్లో విషాదం

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఇంట విషాదం అలముకుంది. సీఎం సతీమణి వైఎస్‌ భారతి తండ్రి, ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని పులివెందులకు తరలించారు. ఆయన స్వగ్రామం వేముల మండలం గొల్లలగూడూరులో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇటీవల సీఎం జగన్ తిరుపతి పర్యటనకు వెళ్లిన సమయంలోనే గంగిరెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సీఎం జగన్ తిరుమల నుంచి నేరుగా హైదరాబాద్ కి వచ్చి మామని పరామర్శించి వెళ్లారు. అప్పటి నుంచి గంగిరెడ్డి కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకి అంత్యక్రియలు జరగనున్నాయి. సీఎం జగన్ అంత్యక్రియలకి హాజరుకానున్నారు.